REGISTRATION COUNTERS OPENED FOR DEVOTEES _ భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దుల కేటాయింపు

Tirumala, 12 June 2021: TTD Additional EO Sri AV Dharma Reddy opened new registration counters in Tirumala on Saturday.

He took part in the Puja and speaking to media later he said from Saturday onwards six more counters have been opened in Tirumala for easy allocation of accommodations to devotees.

All arrangements are completed at all six locations for registration of names for rooms and wait for SMS confirmation and thereafter to proceed towards Sub enquiry offices for payment of tariff and collection of room keys.

He appealed to devotees to note the new facilities developed for their convenience and comforts.

Apart from CRO more counters have become operational at six more locations in Tirumala including one counter at GNC tollgate near luggage Centre, two counters each at Balaji bus station, at Kausthubham rest house, Ram Bhagicha rest house, MBC besides the CRO.

Deputy EOs R1 Sri Lokanatham, R2 Sri Bhaskar and other officials were present in the opening of counters.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు మ‌రింత సుల‌భంగా వ‌స‌తి గ‌దుల కేటాయింపు

తిరుమ‌ల‌లో గ‌దుల రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్లు ప్రారంభించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 జూన్ 12: భ‌క్తుల సౌక‌ర్యార్థం శ‌నివారం ఉద‌యం నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా ఏర్పాటు చేసిన కౌంట‌ర్ల ద్వారా వ‌స‌తి గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంద‌ని అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని సిఆర్‌వో వ‌ద్ద అద‌న‌పు ఈవో పూజ‌లు నిర్వ‌హించి కౌంట‌ర్లు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌లో వ‌స‌తి కొర‌కు సిఆర్‌వో వ‌ద్ద భ‌క్తులకు పేర్లు రిజిస్ట్రేష‌న్ మ‌రియు గ‌దులు కేటాయిస్తున్నార‌న్నారు. సిఆర్‌వో వ‌ద్ద భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండ‌టం, పార్కింగ్ సౌక‌ర్యం లేక‌పోవ‌డం వ‌ల‌న ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పారు. కావున భ‌క్తుల‌కు మ‌రింత త్వ‌రిత‌గ‌తిన పేర్లు న‌మోదు, గ‌దుల కేటాయింపు కొర‌కు తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల‌లో కౌంట‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

ఇందులో భాగంగా సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు, రాంభ‌గిచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ నందు రెండు కౌంట‌ర్ల‌లో భ‌క్తులు వ‌స‌తి కోర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌న్నారు.

పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేయ‌బ‌డుతుంద‌ని చెప్పారు. అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద రుసుం చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చ‌న్నారు. ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు ఆర్ – 1 శ్రీ లోక‌నాథం, ఆర్‌-2 శ్రీ బాస్క‌ర్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవోలు శ్రీ రాజేంద్ర‌కుమార్‌, శ్రీ మోహ‌న్‌రాజు, సూప‌రింటెండెంట్లు శ్రీ సోమ‌శేఖ‌ర్‌, శ్రీ ర‌ఘురామ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.