RS.1CR DONATED_ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం

Tirumala, 13 December 2018: A Hyderbad based donor Sri Nalluri Venkata Seshaiah has donated Rs.1crore to SV Pranadana Trust of TTD on Thursday.

The owner of a software company, NALSOFT Pvt.Ltd., has handed over the DD to Tirumala JEO Sri KS Sreenivas Raju at his chambers’ in Gokulam Rest House at Tirumala.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం

తిరుమల, 2018 డిసెంబరు 13: హైద‌రాబాద్‌కు చెందిన న‌ల్‌సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ న‌ల్లూరి వెంక‌ట‌శేష‌య్య గురువారం శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ఒక కోటి ఒక ల‌క్షా ఒక వెయ్యి 116 రూపాయలు విరాళంగా అందించారు.

తిరుమలలోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో గ‌ల కార్యాలయంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి నిర్వ‌హిస్తున్న ట్ర‌స్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు అందిస్తున్న దాత‌లకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇలాంటి దాత‌ల‌కు ప్ర‌తి ఏటా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నామ‌న్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.