SODASADINA KISHKINDAKANDA _ జూన్ 30 నుండి జూలై 15వ తేదీ వరకు షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణదీక్ష

TIRUMALA, 26 JUNE 2023: The 16-day Sodasadina Kishkinda Kanda  Parayanadeeksha will be observed in Tirumala between June 30 and July 15.

 

On June 29 there will be Ankurarpanam for this fete at Dharmagiri Veda Vignana Peetham.

 

The chapters in the Kishkindakanda will be recited by Vedic pundits as per “Marutasya Samovege Garudasya Samojave” shlokam.

 

While Sri KSS Avadhani will perform Homams and Japams.

 

SVBC will live to telecast the spiritual program for the sake of global devotees.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 30 నుండి జూలై 15వ తేదీ వరకు షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణదీక్ష
 
తిరుమల, 26 జూన్ 2023: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని కోరుతూ జూన్ 30 నుండి జూలై 15వ తేదీ వరకు తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణ దీక్ష కార్య‌క్ర‌మాన్ని టీటీడీ నిర్వ‌హించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి జూన్ 29న రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్ఫ‌ణ నిర్వ‌హిస్తారు. 16 రోజుల‌ పాటు నిష్ణాతులైన వేద పండితుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపడుతోంది.
     
“మారుతస్యసమోవేగేగరుడస్యసమోజవే” అనే శ్లోకం ప్రకారం కిష్కిందకాండలోని సర్గలను పండితులు పారాయణం చేస్తారు. అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వర్యంలో ధర్మగిరిలో హోమాలు, జపాలు నిర్వహిస్తారు.
 
ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.