TTD EO UNVEILS WALL POSTERS FOR ANNUAL BRAHMOTSAVAM OF SRI SOUMYANATHA SWAMY TEMPLE _ నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల గోడ పత్రికలు,  ఆవిష్కరణ

DEVOTEE-FRIENDLY ARRANGEMENTS TO BE ENSURED: TTD EO SRI MUDDADA RAVI CHANDRA

Tirupati/Nandalur, July 8, 2026: TTD Executive Officer Sri Muddada Ravichandra on Wednesday unveiled the wall posters for the annual Brahmotsavams of Sri Soumyanatha Swamy Temple at Nandalur in Kadapa district. The programme was held at the TTD Administrative Building in Tirupati.

Later the EO said the Brahmotsavams will be celebrated from July 21 to 31. The festivities will begin with Ankurarpanam on July 21 and Dwajarohanam on July 22. Major events include Garuda Vahanam (July 26), Kalyanotsavam (July 28), Rathotsavam (July 29), Chakrasnanam (July 30) and Pushpayagam (July 31).

The EO directed officials to make comprehensive arrangements, including decorative lighting, floral decorations, queue lines, arches, sanitation, mobile toilets, first-aid centres, ambulances, fire safety, parking facilities and cultural programmes during the Vahana Sevas. He appealed to devotees to participate in large numbers and receive the blessings of the Lord.

The Lord will bless devotees on different Vahanams every day at 8 a.m. and 7 p.m. during the festival.

The Arjita Kalyanotsavam will be held on July 28 at 10 a.m. Couples can participate by paying Rs.500 and will be presented with prasadam, an uttariyam and a ravika.

Daily devotional and cultural programmes will be organised by the TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project throughout the Brahmotsavams.

TTD JEO Dr. A. Sharath, Chief Engineer T.V. Satyanarayana, Deputy EO Smt. Prasanthi, Temple Inspector Sri Dileep and other officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల గోడ పత్రికలు,  ఆవిష్కరణ

భక్తులకు పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర 

–     జూలై 21 నుండి 31 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు

–     జూలై 22 ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం

తిరుపతి / నందలూరు, 2026 జూలై 08: కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీనప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక  బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారుటిటిడి పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో బుధ‌వారం ఉదయం  కార్యక్రమం జరిగింది.

 సందర్భంగా ఈవో మాట్లాడుతూజూలై 21 నుండి 31 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారుఇందులో భాగంగా జూలై 14 కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నంజూలై 21 తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారుజూలై 22 ధ్వజారోహణంజూలై 26 గరుడసేవజూలై 28 ఉద‌యం కల్యాణోత్సవంజూలై 29 రథోత్సవంజూలై 30 చ‌క్ర‌స్నానంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయ‌న్నారు 

భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలుపుష్పాలంకరణలుక్యూలైన్లుఫ్లెక్సీలుఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారుప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలుకోలాటాలుఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  అదనంగా మొబైల్‌ మరుగుదొడ్లుపారిశుద్ధ్య కార్మికులుప్రథమ చికిత్స కేంద్రాలుఅంబులెన్సులుఅగ్నిమాపక సిబ్బందివాహన పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో కోరారు 

ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకురాత్రి 7 గంటలకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 కార్యక్రమంలో జేఈవో డా.శరత్సిఈ శ్రీ టి.విసత్యనారాయణడిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. 

వాహనసేవల విశేషాలు

జూలై 22

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – యాలి వాహనం

జూలై 23

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – హంస వాహనం

జూలై 24

ఉదయం – పల్లకీ సేవ

రాత్రి – సింహ వాహనం

జూలై 25

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – హనుమంత వాహనం

జూలై 26

ఉదయం – శేష వాహనం

రాత్రి – గరుడ వాహనం

జూలై 27

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

జూలై 28

ఉదయం 10 గంటలకు – ఆర్జిత కల్యాణోత్సవం

రాత్రి – గజ వాహనం

జూలై 29

ఉదయం 9 గంటలకు – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

జూలై 30

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

జూలై 31

సాయంత్రం 6 గంటలకు – పుష్పయాగం

ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం

జూలై 28 తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్తులు (ఇద్దరురూ.500/- చెల్లించి పాల్గొనవచ్చుపాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయంఒక రవికెతో పాటు అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ప్రతిరోజూ ఆధ్యాత్మికసాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్అన్నమాచార్య ప్రాజెక్ట్దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతహరికథఆధ్యాత్మికసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తనున్నారు.

ఆల‌య ప్రాశ‌స్యం  :

ఎర్ర రాతితో నిర్మించిన సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు చోళ సంస్కృతి మరియు వాస్తుశిల్పాన్ని పోలి ఉంటుంది ఆలయం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మరియు ఇది ఒక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంఇక్కడి విగ్రహం తిరుమల కొండల్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుందిప్రధాన విగ్రహం ‘అభయ హస్తంలో ఉండగాతిరుమలలో భగవంతుడు ‘కటి వరద హస్తంపోస్టులో ఉన్నాడు.

 ఆలయానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటేఆలయానికి ఎటువంటి ప్రకాశవంతమైన కాంతి వనరులు లేకుండా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం రెండింటిలోనూ దేవత స్పష్టంగా కనిపిస్తుందికాబట్టిమీరు ప్రవేశ ద్వారం నుండే దేవతను చక్కగా చూడవచ్చుఆలయ పైకప్పుపై భారీ చేప చెక్కబడి ఉందిఒక రోజు  చేప సజీవంగా మారి సముద్రంలో ఈదుతుందని నమ్మకం.

కోరిన కోర్కెలు తీర్చే దేవ‌దేవుడు :

శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం ప్రజల కోర్కెలు తీర్చే దేవదేవుడిగా పేరుగాంచిందిగర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసంకోరిన కోర్కెలు తీరిన తర్వాత గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది.

సౌమ్యనాథ స్వామి ఆలయం నందలూరు, 11 శతాబ్దంలో నిర్మించబడిందిఆలయ గోడలపై 10 శతాబ్దం నుండి 17 శతాబ్దం వరకు శాసనాలు ఉన్నాయి ఆలయం పాండ్యులుకాకతీయులు మరియు విజయనగర రాజవంశాల కాలంలో పునర్నిర్మాణానికి గురైంది ఆలయంలో 2 చెరువులు ఉన్నాయి– ఒకటి ఆలయ ప్రాంగణం లోపల మరియు మరొకటి ఆలయం వెలుపల.

మహాకవి అన్నమయ్య తన 16 సంకీర్తనలతో శ్రీ సౌమ్యనాథ స్వామిని స్తుతించాడుఆలయానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటేమండపం (వరండాస్తంభాలు ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా స్తంభానికి దిగువన సింహాల తలలు ఉంటాయిఇది స్తంభానికి పైన ఉంటుంది కారణంగానే  ఆలయం కింద మరో ఆలయం ఉందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.