TTD TO RELEASE 25000 TICKETS OF RS. 300 QUOTA IN ONLINE FOR RADHASAPTHAMI ON 11-02-2021 _ ఫిబ్రవరి 11న 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రథసప్తమి కోటా విడుదల

APART FROM THIS TTD HAS ALSO ENHANCED RS. 300 TICKETS QUOTA IN ONLINE BY 5000 TICKETS PER DAY WHICH WILL ALSO BE RELEASED ON 11-02-2021 BY 9AM AND THE ENHANCED QUOTA FOR THE REMAINING DAYS IN FEBRUARY.

ఫిబ్రవరి 11న 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల రథసప్తమి కోటా విడుదల

తిరుమ‌ల‌, 2021 ఫిబ్ర‌వ‌రి 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న జరగనున్న రథసప్తమి పర్వదినానికి సంబంధించి భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 25 వేల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

అదేవిధంగా, ఫిబ్రవరి నెలలో మిగిలిన రోజులకు సంబంధించి రోజుకు 5 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి అదనంగా ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఈ టికెట్లు కూడా ఫిబ్రవరి 11న గురువారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రోజుకు 20 వేలు ఉండగా, ఈ కోటా 25 వేలకు పెరిగింది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.