ABHISHEKAM PERFORMED TO KSHETRAPALA RUDRA AT TIRUMALA _ తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

Tirumala, 11 Mar. 21: As part of annual traditions on the occasion of Maha Sivaratri festival on Thursday, TTD organised abhisekam to Sri Rudra- the Kahetrapala located near Gogadbham reservoir.

Archakas from Srivari temple performed the abhisekam and offered naivedyam.

Srivari temple Peishkar Sri Srihari and parupathyedar Sri Gurappa and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

తిరుమల, 2021 మార్చి 11: తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి గురువారం నాడు వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, పారుప‌తైదారు శ్రీ గుర‌ప్ప‌, తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.