KOIL ALWAR TIRUMANJANAM OF GT _ మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 06 May 2024: The traditional temple cleansing ritual Koil Alwar Tirumanjanam will be observed in Sri Govindaraja Swamy temple on May 9.

The annual Brahmotsavams in Sri Govindaraja Swamy temple will be observed from May 16 to 24 with Ankurarpanam on May 15.

The important days includes Dhwajarohanam on May 16, Garuda Vahanam on May 20, Radhotsavam on May 23, Dhwajavarohanam on May 24.

Koil Alwar Tirumanjanam will be observed from 6:30am to 9:30am. Pilgrims will be allowed for Darshan from 10am onwards.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

– మే 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 మే 06: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

16-05-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

17-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

18-05-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

20-05-2024

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

23-05-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

24-05-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మే 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆలయంలో మే 9వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.