BRAHMOTSAVAMS IN RISHIKESH TEMPLE _ మే 21 నుండి 29వ తేదీ వరకు రిషికేష్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 09 May 2024: The annual Brahmotsavams will be held from May 21 to 29 at Sri Venkateswara Swamy Temple in Andhrashram at Rishikesh with Ankurarpanam on May 20.
Every day vahana sevas will be observed from 7.30am to 9am in the mornings and 7pm to 8.30pm in the evenings.
Important days includes Dhwajarohanam on May 21, Kalyanotsavam, Garuda Vahanam on May 25, Radhotsavam on May 28, Chakra Snanam on May 29.
HDPP is organising bhakti sangeet programs during the period.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 21 నుండి 29వ తేదీ వరకు రిషికేష్లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 మే 09: రిషికేష్లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 21 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 20వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తారు.
తేదీ
21-05-2024
ఉదయం – ధ్వజారోహణం,
సాయంత్రం – పెద్దశేష వాహనం
22-05-2024
ఉదయం – చిన్నశేష వాహనం,
సాయంత్రం – హంస వాహనం
23-05-2024
ఉదయం – సింహవాహనం,
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
24-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం,
సాయంత్రం – సర్వభూపాల వాహనం
25-05-2024
ఉదయం – మోహిని అలంకారం,
సాయంత్రం – గరుడవాహనం
26-05-2024
ఉదయం – హనుమంత వాహనం,
సాయంత్రం – గజవాహనం
27-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం,
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
28-05-2024
ఉదయం – రథోత్సవం,
సాయంత్రం – అశ్వవాహనం
29-05-2024
ఉదయం – చక్రస్నానం,
సాయంత్రం – ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.