ASWA VAHANAM HELD _ అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

Tirupati, 27 Feb. 22: On the penultimate day of ongoing annual Brahmotsavams at Srinivasa Mangapuram, Si Kalyana Venkateswara blessed devotees on Aswa Vahanam in Kalki Avatara on Sunday.

 

Due to Covid restrictions the vahana seva took place in Ekantam.

 

DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu, Archaka Sri Balaji Rangacharyulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 27: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు అశ్వ వాహ‌నంపై క‌టాక్షించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహ‌న సేవ‌ల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిరోహించి కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ, భక్తులు కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

వాహ‌న సేవ‌లో టీడీ సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.