ఆగస్టు 11 నుండి 13వ తేదీ వరకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు

ఆగస్టు 11 నుండి 13వ తేదీ వరకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలు

తిరుపతి, ఆగస్టు 09, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో  పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 11 నుండి 13వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 11వ తేదీన అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.
ఆగస్టు 12వ తేదీన ఉదయం యాగశాలపూజ, స్నపనతిరుమంజనం, సాయంత్రం శాంతి కల్యాణం, హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు. ఆగస్టు 13న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం అనంతరం పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు. ఈ మూడు రోజుల పాటు తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.