ఆగస్టు 28న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

ఆగస్టు 28న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి

తిరుపతి, ఆగస్టు 27, 2013: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో ఆగస్టు 28వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గోకులాష్టమి ఆస్థానం, రెండో రోజు ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

గోకులాష్టమి రోజైన బుధవారం ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం,అర్చనలు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అదేవిధంగా గురువారం ఉట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

భక్తులందరు పై ఉత్సవంలో పాల్గొని, భక్తి శ్రద్దలతో స్వామిని పూజించి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.