AGASTESWARA ALAYA ANNUAL EVENT _ ఏప్రిల్ 14 నుండి 23వ తేదీ వరకు నారాయణవనం శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 01 April 2024: The annual Brahmotsavam in Sri Maragatavalli sameta Agasteswara temple, a sub-shrine attached to Sri Kalyana Venkateswara temple at Narayanavanam will be observed from April 14 to 23 with Ganapati utsavam and Ankurarpanam on April 13.

Dwajarohanam will be on April 14 between 6:30am and 7:30am in Mesha Lagnam. The important days include, Nandi Vahanam on April 18, Rathotsavam on April 20, Kalyanotsavam on April 21 where two persons are allowed on payment of Rs.500 per ticket.

On April 22 Nataraja Utsavam, Ravanasura Vahanam, April 23 Trishula Snanam and Dhwajavarohanam with which the annual fest concludes.

Special devotional programs have been arranged by All Dharmic projects of TTD on these days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 14 నుండి 23వ తేదీ వరకు నారాయణవనం శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 01: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 23వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు గణపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 6.30 నుండి 7.30 గంటల మధ్య మేష‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి వాహనసేవ ఉంటుంది.

ఏప్రిల్ 15వ తేదీ సింహ వాహనం, ఏప్రిల్ 16న హంస వాహనం, ఏప్రిల్ 17న శేషవాహనం, ఏప్రిల్ 18న నంది వాహనం, ఏప్రిల్ 19న గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏప్రిల్‌ 20న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఏప్రిల్ 21న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 22న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు రావణేశ్వర వాహనంపై అగస్తీశ్వరస్వామి దర్శనమిస్తారు. ఏప్రిల్ 23న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.