RS TOTSAVAM HELD _ ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

Tirupati, 20 April 2024: The traditional Repakula Subbmma Totosavam was held in Sri Kodanda Ramalayam at Tirupati on Saturday.

The utsava deities were brought to RS Gardens in the old maternity hospital road and Snapana Tirumanjanam was held as mark of tribute to the yeomen services rendered by a great devotee Repakula Subbamma on whose name RS Gardens emerged. From 1910 onwards she conducted Kalpavriksha and Sarvabhoopala vahanams at her own expense to Sri Kodanda Rama. In 1933  soon after TTD emerged, she has given a part of her land as donation to TTD on which SV Balamandiram orphanage was constructed.

DyEO Smt Nagaratna and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం

తిరుప‌తి, 2024 ఏప్రిల్ 20: తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి వారికి శ‌నివారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది.

ఉదయం 8.45 నుండి 9.30 గంటల వరకు శ్రీ కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది.

శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్‌, శ్రీ చ‌ల‌ప‌తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.