E AUCTION OF VASTRAMS _ జులై 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

జులై 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం

తిరుపతి, 2021 జులై 09: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 136 లాట్ల వ‌స్త్రాల‌‌ను జులై 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 09 July 2021:The e-Auction of vastrams being offered by devotees to Tirumala and other temples of TTD will be held from July 15 to 17 on state government e-portal.

The auction includes 136 lots both used and new Vastrams.

For more details contact ph. 0877 2264429 or www.konugolu.ap.gov.in/www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI