డిశెంబర్‌ 17,18వ తేదీలలో సుదర్శన టోకన్ల జారీ నిలిపివేత – టిటిడి

డిశెంబర్‌ 17,18వ తేదీలలో సుదర్శన టోకన్ల జారీ నిలిపివేత – టిటిడి

తిరుపతి, 2010 అక్టోబర్‌ 18: డిశెంబర్‌ 17,18వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిల సందర్భంగా తిరుమలకు తరలివచ్చే లక్షలాదిమంది భక్తులను దృష్ఠిలో వుంచుకొని, దేశవ్యాప్తంగానున్న ఇ-దర్శన్‌ కౌంటర్లనందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులకుగాను రు.50/-ల సుదర్శన టోకన్ల జారీ నిలిపివేయడమైనది.

భక్తులు ఈ మార్పును గమనించి తితిదేకి సహకరించాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.