తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుపతి, జూలై 29, 2013: నెల్లూరుకు చెందిన శ్రీ పాతూరు కుమారస్వామి అనే భక్తుడు సోమవారం తిరుమల శ్రీవారికి రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిని దాత అందజేశారు. ఈ సొమ్మును తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.