తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుమల శ్రీవారికి రూ.5 లక్షల విరాళం

తిరుపతి, సెప్టెంబరు 13, 2013: ముంబయికి చెందిన శ్రీ జయేష్‌ టి. షా అనే భక్తుడు శుక్రవారం తిరుమల శ్రీవారికి రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మొత్తం డి.డిని దాత అందజేశారు. ఈ సొమ్మును తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ కోసం ఖర్చు చేయాలని దాత కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.