GT TEPPOTSAVAMS ENTERS DAY 4 _ తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

TIRUPATI, 20 FEBRUARY 2024: On the fourth day evening on Tuesday as a part of ongoing annual Teppotsavams of Govinda Raja Swamy Temple, Sri Andal sameta Sri Krishna Swamy blessed His devotees on the finely decked float.

Tirumala Chinna Jeeyar Swamy, DyEO Smt Shanti and others, devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారి విహారం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 20: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగ‌ళ‌వారం సాయంత్రం ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆండాళ్‌ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

కాగా బుధ‌వారం నుండి శుక్ర‌వారం వరకు శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిఫ్ణా రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయ‌ణ‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.