మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు అవసరం – టిటిడి ఈవో

మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు అవసరం – టిటిడి ఈవో  

తిరుపతి, 2010 జూలై 31: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి,మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్‌ కృష్ణారావు అన్నారు.

శుక్రవారం సాయంత్రం తితిదే పరిపాలన భవనం వెనుక వైపునున్న క్రీడామైదానంలో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ప్రారంభసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇ.ఒ.కృష్ణారావు క్రీడోత్సవాల జెండాను ఆవిష్కరించి, శాంతికి చిహ్నమైన కపోతాన్ని ఎగురవేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తితిదే ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈ క్రీడలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జె.ఇ.ఒ యువరాజు, సివిఞయస్‌.ఒ ఎం.కె.సింగ్‌, యస్‌.ఇ.సుధాకర్‌ ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.