SUPREME COURT CHIEF JUSTICE AND AP HIGH COURT CHIEF JUSTICE OFFERS PRAYERS AT TIRUMALA TEMPLE _ శ్రీవారిసేవలో తరించిన సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు
శ్రీవారిసేవలో తరించిన సుప్రీం, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు
తిరుమల, 28 జూలై 2013 : తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం ప్రముఖుల విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ పి.సదాశివం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్త కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరి బాపిరాజు, ఇ.ఓ శ్రీ యం.జి.గోపాల్ స్వాగతం పలికారు. అనంతరం అర్చకస్వాములు మహాద్వారం చెంత ఇస్తికఫాల్ సంప్రదాయక స్వాగతం పలికారు. ఆనంతరం ప్రధాన న్యామూర్తులిరువురు శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అటు తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రధాన న్యాయమూర్తులకు, వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రాలను, లడ్డూ తీర్థ ప్రసాదాలు, శ్రీవారి ఫోటో మరియు ఆధ్యాత్మిక దేవస్థానం ప్రచురణలను తి.తి.దే చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇ.ఓ యం.జి గోపాల్ వారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, సి.వి.ఎస్.ఓ శ్రీ అశోక్కుమార్, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, తి.తి.దే ఉన్నతాధి కారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ప్రధాన న్యాయమూర్తులు పెద్దజీయంగార్ మఠంలో జీయంగర్ స్వాముల ఆశీర్వాదం పొందారు. అటు తరువాత అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి తమ మ్రొక్కు తీర్చుకున్నారు. వీరి వెంట హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎన్.వి.రమణ, ఇతర జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.