హంస వాహనసేవలో 14 పుస్తకాలు ఆవిష్కరణ
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హంస వాహనసేవలో 14 పుస్తకాలు ఆవిష్కరణ
అక్టోబరు 01, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి హంస వాహనసేవలో 14 పుస్తకాలను టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రంథం పేరు రచయిత పేరు
1. శ్రీవైఖానస సిద్ధాంత లేశాదర్శ: శ్రీమాన్. ఎమ్.టి.విష్ణువర్థన్
2. శ్రీవైఖానస సంధ్యావందనం డా.తూమాటి బ్రహ్మచార్య
3. అర్చనానవనీతమ్ శ్రీమాన్ పరాశరం భావన్నారాయణాచార్య
4. అర్చనాతిలకమ్ డా.గంజాం రామకృష్ణమాచార్యులు
5. తిరుమల క్షేత్రచరిత్ర డా.ఆకెళ్ల విభీషణ శర్మ
6. తులసి దివ్యమహిమలు డా.డి.ఉమాదేవి
7. బ్రహ్మాండనాయకుని బాల్యలీలలు శ్రీ సి.బి.ఈరన్న
8. స్వరజ్జానవర్షిణి కీ.శే.డా. వేదవ్యాస రంగభట్టర్
9. పౌరాణిక నీతికథలు శ్రీ రావినూతల శ్రీరాములు
10. చందాస్ యాజ్ వేదాంగ డా.మాధవి కె.నర్సాలె
11. శ్రీవేంకటేశ్వరస్వామి అవతారం (తమిళం) డా.పి.ఉమ
12. అంబోపాఖ్యానం విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు
13. పురాణాంకే నీతికథాయే డా.ఎమ్.ఆర్.రాజేశ్వరి
14. నారాయణమంత్రం డా.గాలి గుణశేఖర్
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.