HANUMANTA VAHANAM HELD _ హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు
Tirupati, 04 March 2024: The ongoing annual Brahmotsavam on Tuesday witnessed Sri Kalyana Venkateswara as Venkatadri Rama on Hanumanta Vahanam at Srinivasa Mangapuram.
Spl Gr DyEO Snt Varalakshmi, AEO Sri Gopinath and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు
తిరుపతి, 2024 మార్చి 05: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవము వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.