LAKSHA BILVARCHANA IN KT _ నవంబరు 12న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన

TIRUPATI, 10 NOVEMBER 2022: Laksha Bilvarchana Seva will be performed in Sri Kapileswara Swamy temple in Tirupati on November 12.

 

This event will take place between 6am and 12noon. The devotees shall participate by purchasing Rs.100 ticket per person.

 

In the evening Chandra Sekhara Swamy utsavamurty will be paraded.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 12న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన

నవంబరు 10, తిరుప‌తి, 2022: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 12వ తేదీన శ‌నివారం లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఒక్కొక్క‌రు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి ల‌క్ష బిల్వార్చ‌న సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్ర‌శేఖ‌ర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.