ASTABANDHANA JEERNODHARANA MAHA SAMPROKSHANAM IN APPALAYAGUNTA FROM SEPTEMBER 2 TO 6_ సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ

Tirupati, 30 August 2018: After observing Balalayam in the famous temple of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta, the Jeernodharana Maha Samprokshanam will be observed from September 2 to 6.

This celestial fete commences with Ankurarpanam on September 1 evening. It may be mentioned here that the renovation works commenced in the temple on August 6 after setting up Daru Vigraham of the main deity. The sanctum sanctorum ia closed since then and will be opened only after observing Purnahuti on September 6 by 7am.

Meanwhile on from September 2 to 5 religious events will be observed in Yagashala which includes Ksheeradhivasam, Jaladhivasam, Kalapakarshana, Sarava Devataradhana etc.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2018 ఆగస్టు 30: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ సెప్టెంబరు 2 నుండి 6వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సెప్టెంబరు 1వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటలకు మేదిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, ద్వారపాలకులు గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) ఈ నెల 6వ తేదీ నుండి చేెపట్టిన విషయం విధితమే.

ఇందులో భాగంగా సెప్టెంబరు 2వ తేదీ ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు పంచగవ్యప్రాశన, అకల్మషహోమం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు అగ్నిప్రణయనం, కళాపకర్షణము, శ్రీవారి పరివార దేవతలు యాగశాలకు వేంచేపు చేస్తారు. సెప్టెంబరు 3న ఉదయం 8.00 నుండి 11.30 గంటల వరకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనము, అష్టబంధనము, సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

సెప్టెంబరు 4న ఉదయం 8.00 నుండి 11.30 గంటల వరకు క్షీరాధివాసం, జలాధివాసం, వివిధ హోమాలు, సెప్టెంబరు 5న ఉదయం వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు సర్వదేవతాహ్వానం, శయనాధివాసము జరుగనుంది. సెప్టెంబరు 6న ఉదయం 7.00 గంటలకు మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.