AP CS OFFERS PRAYERS AT TIRUCHANOOR _ అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

TIRUMALA, 08 APRIL 2023: The Chief Secretary of Andhra Pradesh Dr KS Jawahar Reddy offered prayers at Sri Padmavati Ammavari temple in Tiruchanoor on Friday.

After darshan, he was offered theertha prasadams by JEO Sri Veerabrahmam.

District Collector Sri Venkatramana Reddy, Joint Collector Sri Balaji, RDO Sri Kanaka Narasa Reddy, Temple DyEO Sri Lokanatham was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తిరుపతి 8 ఏప్రిల్ 2023: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు డాక్టర్ జవహర్ రెడ్డికి శేషవస్త్రం అందించి ఆశీర్వదించారు. డిప్యూటీ ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి, టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ శ్రీ బాలాజి, ఆర్డీవో శ్రీ కనక నరసా రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది