AP LEGISLATIVE ASSEMBLY SPEAKER OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ ప్రపంచం చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించా : ఏపీ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం
Tiruchanoor, 3 Jul. 20: The Honourable Speaker of AP Legislative Assembly Sri Tammineni Sitaram offered prayers in the temple of Sri Padmavathi Ammavaru at Tiruchanoor on Friday evening.
Ex-officio Member of TTD Trust Board, Dr C Bhaskar Reddy, JEO Sri P Basant Kumar, temple DyEO Smt Jhansi Rani and other temple staff were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ప్రపంచం చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించా : ఏపీ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం
తిరుపతి, 2020 జూలై 03: ప్రపంచంలోని ప్రజలందరూ కరోనా వైరస్ బారి నుంచి బయటపడి చల్లగా(ఆరోగ్యంగా) ఉండాలని శ్రీపద్మావతి అమ్మవారిని ప్రార్థించానని ఏపీ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట జెఈవో శ్రీ పి.బసంత్కుమార్ స్పీకర్కు స్వాగతం పలికారు.
దర్శనానంతరం జెఈవో స్పీకర్కు అమ్మవారి ప్రసాదాలను అందించారు. చంద్రగిరి శాసనసభ్యులు, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పీకర్ను శాలువతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా వ్యాధి భయంతో ఉన్నారని, త్వరలోనే వైరస్ నశించి ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆర్డీవో శ్రీ కనకనరసారెడ్డి, ఎవిఎస్వో శ్రీ చిరంజీవులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.