ఫిబ్రవరి 7న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

ఫిబ్రవరి 7న ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

ఫిబ్రవరి 05, తిరుపతి, 2018: టిటిడిలో వినియోగంలో లేని డిజిటల్‌ కెమెరాలు, సాధారణ కెమెరాలు, హ్యాండికామ్‌లు, కెమెరా ఫ్లాష్‌ లైట్లు, పెన్‌ కెమెరాలు, మొబైల్‌ ఫోన్లు, పవర్‌ బ్యాంక్‌లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం ఫిబ్రవరి 7వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో పోగయిన 41 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org/www.mstcecommerce.com/www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.