ఏప్రిల్‌ 26వ తేదీన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

ఏప్రిల్‌ 26వ తేదీన ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం

ఏప్రిల్‌ 21, తిరుపతి 2018: టిటిడిలో వినియోగంలో లేని మొబైల్‌ ఫోన్లు, కలర్‌ ప్రింటర్లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఈ-వేలం ఏప్రిల్‌ 26వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 43 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org/www.mstcecommerce.com/www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.