AYODHYA KANDA SIXTH EDITION AKHANDA PARAYANAM ON JAN 21 _ జనవరి 21న అయోధ్యకాండ 6వ విడత అఖండ పారాయణం
TIRUMALA, 20 JANUARY 2023: The sixth edition of Ayodhya Kanda Akhanda Parayanam will be observed at the Nada Neerajanam platform in Tirumala between 7am and 9am on January 21.
As part of this, 199 shlokas from chapters 18-21 will be recited by the Vedic scholars, students, devotees besides 25 shlokas from Yoga Vasistyam and Dhanwantari Maha Mantra Parayanam.
SVBC will live telecast this programme for the sake of global devotees.
జనవరి 21న అయోధ్యకాండ 6వ విడత అఖండ పారాయణం
తిరుమల, 20 జనవరి, 2024: లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 21వ తేదీ ఆదివారం 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
అయోధ్యకాండలోని 18 నుండి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.