అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 సెప్టెంబరు 26: టిటిడి పరిధిలోని బెంగళూరులో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 4న సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా అక్టోబరు 5న యాగశాలలో వాస్తుహోమం, రక్షాబంధనం, రాత్రి పవిత్రప్రతిష్ఠ నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఉదయం స్నపనతిరుమంజనం ఆ తరువాత పవిత్ర సమర్పణ చేపడతారు. అక్టోబరు 7న ఉదయం స్నపనతిరుమంజనం, రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరియం, ఒక రవికె, ఒక లడ్డూ, వడ, ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు అభిషేకం, కల్యాణోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.