CHANDRAGIRI RAMALAYAM BRAHMOTSAVAM COMMENCES _ ధ్వజారోహణంతో వైభవంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
TIRUPATI, 17 APRIL 2024: The annual Brahmotsavam in Chandragiri Ramalayam temple commenced on a grand religious note with Dhwajarohanam on Wednesday.
Superintendent Sri Srinivasulu, temple inspector Sri Haribabu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ధ్వజారోహణంతో వైభవంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2024 ఏప్రిల్ 17: చంద్రగిరి శ్రీకోదండరామస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా సకలదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 9.05 నుండి 10 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసభట్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిబాబు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.