KARNATAKA CM OFFERS PRAYERS_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క‌ర్నాట‌క‌ ముఖ్యమంత్రి శ్రీ య‌డియూరప్ప

Tirumala, 31 Aug. 19: The Chief Minister of Karnataka, Sri Yediyurappa offered prayers in the temple of Sr Venkateswara Swamy on Friday.

After darshan of Lord, he was offered Vedasirvachanam at Ranganayakula Mandapam. Special Officer Sri AV Dharma Reddy presented Theertha Prasadams of Lord to the CM of Karnataka.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క‌ర్నాట‌క‌ ముఖ్యమంత్రి శ్రీ య‌డియూరప్ప

తిరుమల, 2019 ఆగ‌స్టు 31: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని క‌ర్నాట‌క‌ ముఖ్యమంత్రి శ్రీ య‌డియూరప్ప శ‌నివారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రికి టిటిడి అధికారులు స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

అనంతరం శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగనరసింహస్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి శ్రీ య‌డియూరప్పకి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అటుతర్వాత తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.