DHARMA RAKSHANA YAGAM for 21 Days Begins in Vedic University Campus _ ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభం            

TIRUPATI, 12 Aug 2010: Sri Sri Sri Siddeswarananda Bharathi Swamy of Siddeswari Peethadhipathi, Courtallam has started “DHARMA RAKSHANA YAGAM” for a period of 21 days at S.V.Vedic University Compound in Tirupati on Thursday morning.
 
Dr. N.Yuvaraj, Joint Executive Officer released Audio CD and Book titled “Mouna Prabha” at the venue.
 
Sri M.K.Singh, C.V&S.O TTDs, Dr. Kavitha Prasad, Secretary HDPP and large number of devotees took part.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభం            

తిరుపతి, 2010 ఆగష్టు 12: కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి వారి నిర్వహణలో గురువారం ఉదయం స్థానిక వేద విశ్వవిద్యాలయం యాగశాలలో ధర్మపరిరక్షణ యాగం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో అవ్యవస్థపెరిగి పొయిందనీ, దానినుండి సమాజాన్ని కాపాడడానికి ఈ యాగం చేస్తున్నామని, మనుష్యులలో అథార్మిక  భావాలను తొలగించడానికి దేశవ్యాప్తంగా ఇటువంటి యాగాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దేశాన్ని, సమస్త మానవులను కాపాడేందుకు చేస్తున్న ఈ యాగంలో కుల,మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చునని స్వామిజీ తెలిపారు. ఈ యాగంలో మంత్ర ప్రేరిత‌ములైన దేవతలు తప్పక మనల్ని అనుగ్రహిస్తారని స్వామిజీ అన్నారు. ఈ యాగం సెప్టెంబరు 2వ తేది వరకు జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా మౌనప్రభ అను మాసపత్రికను, వేంకటేశ సహస్రనామస్థోత్రం సిడిలను తితిదే జెఇఓ డాక్టర్ యువరాజ్‌ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌, డిపిపి కార్యదర్శి డాక్టర్‌ రాళ్ళబండి కవితా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.