డిసెంబరు 1న డయల్‌ యువర్‌ ఈవో

డిసెంబరు 1న డయల్‌ యువర్‌ ఈవో

నవంబరు 29, తిరుమల, 2017: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం డిసెంబరు 1వ తేదీన జరుగనుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయవచ్చు. ఇందుకోసం భక్తులు సంప్రదించాల్సిన నంబరు : 0877-2263261.

డిసెంబరు 1న ఉదయం 10 గంటలకు 2018, మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేయనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.