FIVE DAY SRI VARI ANNUAL FLOAT FESTIVAL BEGINS _ అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం
అంగరంగ వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి, ఏప్రిల్ 23, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు మంగళవారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రకాలతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6.00 గంటలకు సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.