GOVERNOR DESIGNATE OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE_ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర నియామక గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్…

Tiruchanoor, 23 Jul. 19: The Governor designate of Andhra Pradesh Sri Biswa Bhushan Harichandan offered prayers in the temple of Sri Padmavathi Devi at Tiruchanoor on Tuesday along with his family.

He was given warm reception by TTD officials at the main entrance of the temple at Tiruchanoor. After darshan of presiding deity of Goddess Padmavathi Devi he was offered Theertha Prasadams to the dignitary.

TTD Chairman Sri YV Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO P Basant Kumar, temple DyEO Smt Jhansi Rani were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర నియామక గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్…

జూలై 23, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఏపీ రాష్ట్ర నియామక గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| నియామక గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్చక బృందం కలిసి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనంలో కుంకుమార్చన, వేదాశీర్వచనం చేశారు. అనంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ ముందుగా శ్రీవారిని దర్శించుకుని , అనుతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అన్భురాజన్, టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ ఝాన్సీలక్ష్మీ, వీజీవో శ్రీ అశోక్ కుమార్ గౌడ్, ఎవిఎస్‌వో శ్రీ నందీశ్వర్ రావు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.