HM AND AP CM WELCOMED AT SRI PADMAVATHI REST HOUSE _ తిరుమ‌ల‌లో భార‌త హోం మంత్రి గౌ|| శ్రీ అమిత్ షాకు ఘన స్వాగతం

TIRUMALA, 13 NOVEMBER 2021: The Honourable Union Home Minister Sri Amit Shah and Honourable CM of AP Sri YS Jaganmohan Reddy reached Tirumala on Saturday night.

 

TTD EO Dr KS Jawahar Reddy and CVSO Sri Gopinath Jatti welcomed the dignitaries with floral bouquets.

 

Among those who received the Home Minister and CM of AP includes, Ministers Sri P Ramachandra Reddy, Sri V Srinivasa Rao, Deputy District Collector Sri Harinarayana, Tirupati Urban SP Sri Venkatappala Naidu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో భార‌త హోం మంత్రి గౌ|| శ్రీ అమిత్ షాకు ఘన స్వాగతం

తిరుమల, 2021 న‌వంబ‌రు 13: భార‌త హోం మంత్రి గౌ|| శ్రీ అమిత్ షా,గో : ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ‌నివారం రాత్రి తిరుమల శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు.

టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి పుష్పగుచ్చాలతో వీరికి స్వాగతం పలికారు.

మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు ,టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ వైద్యనాథన్ కృష్ణ మూర్తి,, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట‌ప్ప‌ల నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్‌. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ‌నివారం రాత్రి తిరుమలలోని శ్రీకృష్ణ‌ విశ్రాంతి భవనానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ వెలం పల్లి శ్రీనివాసరావు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి, తిరుప‌తి శాస‌న‌స‌భ్యులు శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.