తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.25.33 కోట్లు

తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.25.33 కోట్లు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 01: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.25.33 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 50,400 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

తలనీలాలలో మొదటి రకం(31 ఇంచుల పైన), రెండో రకం(16 నుండి 30 ఇంచులు), మూడో రకం(10 నుండి 15 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

కిలో రూ.22,494/-గా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 9,600 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.67.48 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.17,223/-గా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 48,400 కిలోలను వేలానికి ఉంచగా 8,900 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.15.33 కోట్ల ఆదాయం సమకూరింది.

కిలో రూ.2,833/-గా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 31,600 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 31,400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.8.89 కోట్ల ఆదాయం లభించింది.

కిలో రూ.1,195/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 300 కిలోలను వేలానికి ఉంచారు. 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 1.20 లక్షల ఆదాయం వచ్చింది.

కిలో రూ.24/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 9,000 కిలోలను వేలానికి ఉంచగా అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.3.24 లక్షల ఆదాయం సమకూరింది.

కిలో రూ.5,462/-గా ఉన్న తెల్ల వెంట్రుకలను 700 కిలోలను అమ్మకానికి ఉంచగా అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా 38.24 లక్షల ఆదాయం లభించింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.