I-DAY FETE OBSERVED AT TIRUMALA_ తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Tirumala, 15 Aug. 19: The 73rd Independence Day was observed in a grand manner at Tirumala on Thursday.

The Special Officer Sri A V Dharma Reddy hoisted the National Flag in Gokulam Camp Office and sought the employees to re dedicate themselves in pilgrim service.

VGO Sri Manohar, CE Sri Ramachandra Reddy, Estates Officer Sri Vijaya Saradhi and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 15, తిరుమల 2019: తిరుమలలో గురువారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గోకులం విశ్రాంతి భవనంలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఏవీ ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వహించడమే స్వాతంత్య్ర సమరయోధులకు సమర్పించే నిజమైన నివాళి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన జాతీయ నేతలను స్ఫూర్తిగా తీసుకుని సేవలు అందించేందుకు కంకణబద్ధులై ఉండాలని ఉద్యోగులను కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు తిరుమల ప్రత్యేకాధికారి 73వ‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ జి. రామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. ఆర్.ఆర్.రెడ్డి , ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారధి, డిప్యూటీ ఈవోలు శ్రీమతి నాగరత్న, శ్రీ బాలాజీ, శ్రీ పార్వతి, వీఎస్వో శ్రీ మనోహర్, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ జీఎల్ఎన్ శాస్త్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.