INDIVIDUAL REGISTRATION TO OPEN UP FOR SRIVARI SEVA FROM MARCH 30_ మార్చి 30వ తేదీ నుండి శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత నమోదుకు అవకాశం

SEVAKULU ARE ELIGIBLE FOR SEVA FROM APRIL 9 ONWARDS

Tirumala, 27 March 2018: With an aim to strengthen Srivari Seva and to enhance transparency in the voluntary service system, TTD has introduced 3-day and 4-day services apart from 7-day seva also.

To encourage more youth to take part in 3-day and 4-day Srivari Seva, TTD has set to enable individual registration from March 30 onwards. The sevakulu who registered for Srivari Seva will render service from April 9 in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 30వ తేదీ నుండి శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత నమోదుకు అవకాశం

మార్చి 27, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు ఉద్దేశించిన శ్రీవారిసేవకు మార్చి 30వ తేది నుంచి ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. శ్రీవారి సేవను మరింత పటిష్ఠం చేసేందుకు గతేడాది నవంబర్‌ నుంచి 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల సేవను ఆన్‌లైన్‌లో బృందంగా నమోదు చేసుకునే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరింత ఎక్కువ మంది యువతను, ఉద్యోగులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు వ్యక్తిగతంగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో మార్పులు చేపట్టింది. ఈ నూతన విధానంలో మార్చి 30వ తేదీన వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే శ్రీవారి సేవకులు ఏప్రిల్‌ 9వ తేది నుంచి తిరుమలలో సేవలు అందించాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.