JK LT GUV & UNION MINISTER INVITED FOR JAMMU TEMPLE MAHA FETE _ జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి- లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మన్ ఆహ్వానం

TIRUPATI, 26 MAY 2023: TTD Trust Board Chairman Sri YV Subba Reddy invited the Lt Governor of Jammu and Kashmir Sri Manoj Sinha and Union Minister Sri Jitendra Singh in New Delhi on Friday to participate in the Maha Samprokshanam fete of Sri Vari temple in Jammu on June 8.

Offering the invitation he briefed them about the Maha Samprokshanam festivities scheduled between June 3 and 8.

The Chairman also offered them Srivari Theertha Prasadams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

– లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మన్ ఆహ్వానం

తిరుపతి 26 మే 2023: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జమ్ము కాశ్మీర్ లెఫ్టి నెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా , కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ ను ఆహ్వానించారు.
ఢిల్లీ లో శుక్రవారం సాయంత్రం చైర్మన్ వీరిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రిక అందజేశారు.

జూన్‌ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారికి వివరించారు.

జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. చైర్మన్ వీరిద్దరినీ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

టీటీడీ ప్రజా సబంధాల అధికారిచే జారీ చేయడమైనది