JYOTHI RAO PULE JAYANTHI ON APRIL 11_ఏప్రిల్‌ 11న టిటిడిలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

Tirupati, 9 April 2018: The 191st Birth Anniversary of Mahatma Jyothiba Pule will be observed in TTD Administrative Building on April 11.

This fete will commence by 10am in the quadrangle of Ad building.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 11న టిటిడిలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 09: కులవ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగులకు అండగా నిలిచిన శ్రీజ్యోతిబా పూలే 191వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్‌ 11వ తేదీ బుధవారం ఘనంగా నిర్వహించనుంది.

టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో ఉదయం 10.00 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధ్యక్షతన జరుగనున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.