KARTHIKA VANA BHOJANAM IN SKVST ON NOV 15_ నవంబరు 15న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనం

Tirupati, 13 November 2017: The celestial Karthika Vana Bhojanam will be observed in the Paruveta Mandapam located at Srinivasa Mangapuram on November 15.

Earlier during the day the utsavarulu are being taken to the green premises located near Srivarimettu Venkateswara Swamy temple and Snapana Tirumanjanam is performed to the deities followed by the community lunch.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 15న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనం

నవంబరు 13, తిరుపతి, 2017: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 15వ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జిత సేవలను రద్దు చేశారు. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉదయం 9.30 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.