ఫిబ్రవరిలో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

ఫిబ్రవరిలో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 ఫిబ్రవరి 02: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఫిబ్రవరిలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్రవరి 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.

– ఫిబ్రవరి 15న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. రాత్రి 7.00 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

– ఫిబ్రవరి 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.