KRT POSTERS RELEASED_ శ్రీ కోదండరామాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 19 Apr. 18: Tirupati JEO Sri P Bhaskar on Thursday released the posters in his chambers in TTD administrative building, related to annual Pushpayagam in Sri Kodanda Rama Swamy temple scheduled on April 22.

In connection with this fete, Ankurarpanam will be performed on April 21.

DyEO Smt Jhansi was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

శ్రీ కోదండరామాలయ పుష్పయాగం గోడపత్రికలు ఆవిష్కరణ

ఏప్రిల్‌ 19, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 22వ తేదీన జరుగనున్న పుష్పయాగ మహోత్సవం గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ గురువారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామాలయ డెప్యూటీ ఈవో శ్రీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 21న సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగనుంది. ఏప్రిల్‌ 22న ఉదయం 10.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

శ్రీకోదండరామాలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.