LAUNCHING OF AUDIO CD ANNAMAYYA PADA RAAJEEVAM_ అన్న‌మ‌య్య ప‌ద రాజీవం సిడి ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 11 Sep. 19: A CD on Annamacharya Sankeertans rendered by renowned vocal artist Sri. P.S.Ranganath was released on Wednesday evening.

On the occasion of Sravana Nakshatram on 11-08-2019 at Annamacharya Kalamandiram in Tirupati this CD titled Annamayya Pada Rajeevam was released.

Later, Sri Ranganath presented some sankeertans and enthralled the audience.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్న‌మ‌య్య ప‌ద రాజీవం సిడి ఆవిష్క‌ర‌ణ‌

తిరుప‌తి, 2019 సెప్టెంబరు 11: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధ‌వారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “అన్న‌మ‌య్య ప‌ద రాజీవం” సిడిని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ మునిర‌త్నంరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సిడిలోని సంకీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయ‌కులు శ్రీ పారుప‌ల్లి శ్రీ‌రంగ‌నాథ్ స్వ‌ర‌ప‌రిచారు. శ్రీ‌మ‌తి సైంధ‌వితో క‌లిసి శ్రీ శ్రీ‌రంగ‌నాథ్ గానం చేశారు. ఈ సందర్భంగా స్వ‌ర‌క‌ర్త‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం శ్రీ పారుప‌ల్లి శ్రీ‌రంగ‌నాథ్ ఈ సంకీర్తనలను రాగ‌భావ‌యుక్తంగా పాడి వినిపించారు.

ఈ సిడిలోని సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.