MORE DARSHAN HOURS AND PERCENTAGE OF ACCOMMODATION FOR COMMON PILGRIMS-TTD EO_ ఎస్వీ వేద వర్సిటీలో ఆస్ట్రాలజీ కోర్సు – డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

OCCULT SCIENCES IN SV VEDIC UNIVERSITY SOON

 

TIRUMALA, 06 APRIL 2023: With common pilgrims who are visiting Tirumala temple for darshan as its top most priority, TTD has been allocating 15 hours of darshan a day to common pilgrims in a day along with 85% available accommodation at Tirumala, said TTD EO Sri AV Dharma Reddy.

 

Speaking to the pilgrims callers during the Dial Your EO program held at Annamaiah Bhavan in Tirumala on Friday, the EO attended to 31 callers from across the country. Some excerpts from the live phone-in program.

 

When a pilgrim caller Sri Shankar from Hyderabad sought EO to reduce VIP break facilitating more darshan hours for common pilgrims, the EO answered of the 18hours of Darshan meant for a day, only three hours are being provided to VIP while the remaining 15hours to common pilgrims. “As the summer rush is commencing soon, the TTD board has decided to cut down VIP referrals, Rs.300, SRIVANI, Virtual sevas, Tourism tickets also till July 15 starting from April 15 facilitating more darshan hours to common pilgrims”, he asserted. The EO also said, of the available 7400 rooms and four PACs, 85% of accommodation is for common pilgrims only in Tirumala.

 

Another caller, Sri Ravi from Kavali, suggested EO to introduce Netra Dana Trust for the sake of the visually impaired, to which EO said, TTD has already entered MoU with the renowned Aravind Eye Care Hospital in offering the best possible services to the needy with eye-related ailments. Welcoming the suggestion, he will look into the suggestion.

 

A pilgrim caller Smt Syamala from Chennai brought to the notice of EO of non-issue of laddus for her token, to which EO answered, the tokenless Sarvadarshan devotees will be issued laddu token slips in Vaikuntham Queue Complex which should be scanned otherwise will not be issued at Laddu Counters. “So scan the laddu slips properly to procure one free laddu on one slip”, he maintained.

 

Another caller Sri Chandramouli from Hyderabad sought EO introduce Astrology Course in TTD-run Sri Venkateswara Vedic University. 

 

Responding to the caller, the EO said, the plans are already underway and very soon TTD will introduce Occult Sciences, Pranayamam, and other courses. 

 

Sri Appanna from Visakhapatnam suggested EO to apply Tirunamam to all devotees through Srivari Sevaks to which EO agreed. 

 

While a pilgrim suggested to introduce UPI payments for lucky dip seva tickets allotment under current booking, another caller suggested commence Arjita Sevas in Srivari temple at Visakhapatnam to which the EO responded positively. The other suggestions includes for proper sign board between Tiruchanoor and Appalayagunta, Nijapada Darshan, enhancing quality of laddus, annprasadam, Jalaprasadam units in Alipiri footpath, cleanliness in Kalyani choultry etc.  

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao and other senior officials in Tirumala were also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ వేద వర్సిటీలో ఆస్ట్రాలజీ కోర్సు – డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో శ్రీ ఎవి.ధర్మారెడ్డి

తిరుమల, 07 ఏప్రిల్ 2023: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం శుక్రవారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. రవి – కావలి

ప్రశ్న : నేత్రదాన ట్రస్టును ప్రారంభించి అవసరమైన వారికి కార్నియా దానం చేయండి.

ఈవో : అరవింద ట్రస్టుతో ఒప్పందం చేసుకుని తిరుపతిలో నేత్ర వైద్య సేవలు అందిస్తున్నాం. వారితో చర్చించి ఐ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తాం.

2. అనిల్ కుమార్ – గోరంట్ల

ప్రశ్న : కాషన్ డిపాజిట్ రీఫండ్ కావడం లేదు.

ఈవో : కాషన్ డిపాజిట్ పై ఇటీవల ఎలాంటి ఫిర్యాదులు లేవు. మీతో చర్చించి రీఫండ్ అయ్యేలా చూస్తాం.

3. ప్రసాద్ – చీరాల

ప్రశ్న : 2009 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన చేస్తున్నాం. మాకు నాదనీరాజన వేదికపై అవకాశం కల్పించండి.

ఈవో : ఎస్వీబిసి నిబంధనల మేరకు నాదనీరాజన వేదికపై అవకాశం కల్పిస్తాం.

4. శంకర్ – హైదరాబాద్

ప్రశ్న : విఐపి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయించడం తగ్గించండి. రూ.300/- దర్శన టికెట్లు రెండు నెలల ముందుగానే కేటాయించండి.

ఈవో : విఐపి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయించడం కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం. వేసవి నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రూ.300/- దర్శన టికెట్ల కోటా తగ్గించి మార్చి నెలలో విడుదల చేశాం. ఈ నెలలో మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఒకటేసారి విడుదల చేస్తాం.

5. శ్యామల – చెన్నై

ప్రశ్న : లడ్డూ టోకెన్ స్కాన్ కాకపోవడం వల్ల మాకు లడ్డూలు అందలేదు.

ఈవో : ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన తరువాత లడ్డూ టోకెన్ జారీ చేస్తారు. దీన్ని క్యూలైన్ లో మరోసారీ స్కాన్ చేసుకున్న తర్వాత మాత్రమే లడ్డూలు పొందడానికి వీలవుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.

6. కిరణ్ – తెనాలి

ప్రశ్న : తిరుచానూరులో రోడ్డుపై వాహనం నిలిపినా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్నారు.

ఈవో : ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన చర్యలు తీసుకుంటాం.

7. గీత – విల్లివాక్కం

ప్రశ్న : నా భర్తకు 65 ఏళ్లు. మోకాలి నోప్పులు ఉన్నాయి. దర్శనానికి ఎలా రావాలి.

ఈవో : వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్ లైన్లో దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నాం. వీటిని ఉచితంగా బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు. దగ్గర దారిలో దర్శనం కల్పిస్తాం. నడవలేని వారిని బయోమెట్రిక్ నుంచి దర్శనానికి పంపుతాం.

8. జగదీష్ – వేలూరు

ప్రశ్న : శుక్రవారం నాడు నిజపాద దర్శనం సేవను పునరుద్ధరించండి.

ఈవో : సామాన్య భక్తులకు ఎక్కువ మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించడంతోపాటు స్వామివారి నైవేద్యం ఆలస్యం కాకుండా ఉండేందుకే శుక్రవారం రోజు జారీ చేస్తూ వచ్చిన నిజపాదదర్శనం సేవాటికెట్లను టిటిడి బోర్డు తాత్కాలికంగా రద్దు చేసింది.

9. సత్యశ్రీ – విజయనగరం, రాజ్యలక్ష్మి – గిండి

ప్రశ్న : తిరుమల దర్శనానికి వచ్చాం. ఆన్లైన్ లో శ్రీవారి సేవా టికెట్ ఇప్పిస్తామని దళారులు మోసం చేశారు.

ఈవో : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. భక్తులు దళారుల బారిన పడకుండా వీటిని బుక్ చేసుకోండి.

10. చంద్రమౌళి – హైదరాబాద్

ప్రశ్న : ఆస్ట్రాలజి కోర్సు ప్రవేశపెట్టండి.

ఈవో : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆస్ట్రాలజీ మరియు అకల్ట్ సైన్సెస్ విభాగాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం.

11. లీలాసాగర్ – నెల్లూరు
ప్రశ్న : పిఎసి-2లో లాకర్ తీసుకున్నాం. పారిశుధ్యం సరిగా లేదు. బకెట్లు లేవు. వెంగమాంబ భవనంలో భోజనం నాణ్యత సరిగా లేదు. లడ్డూలు గట్టిగా ఉంటున్నాయి.

ఈవో : ఈ విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

12. గోవర్ధన్ – జగిత్యాల

ప్రశ్న : తిరుమలలో లక్కీడిప్ లో ఆర్జిత సేవా టికెట్ వచ్చింది. అరగంట లేటుగా వెళ్ళినందుకు టికెట్ రద్దయింది. గూగుల్ పే ప్రవేశపెట్టండి. నడకదారిలో టికెట్ పొందితే కొండపై లక్కీడిప్ లో సేవలకు నమోదు చేసుకోవచ్చా.

ఈవో : లక్కీడిప్ లో సేవా టికెట్ పొందిన భక్తులు సొమ్ము చెల్లించేందుకు గూగుల్ పే, ఫోన్ పే విధానాన్ని ప్రవేశపెడతాం. నడకదారిలో దర్శన టికెట్ కు, లక్కీడిప్ లో సేవా టికెట్ కు ఎలాంటి సంబంధం లేదు.

13. సుబ్రహ్మణ్యం – కొత్తపల్లి

ప్రశ్న : తిరుచానూరు నుంచి అప్పలాయగుంటకు వెళ్లే దారిలో సూచిక బోర్డులు లేవు.

ఈవో : ఇక్కడ సూచిక బోర్డులు ప్రవేశపెట్టేందుకు ఆదేశాలు జారీ చేశాం.

14. చైతన్య – బెంగళూరు

ప్రశ్న : కళ్యాణిలో గది తీసుకున్నాం. గది కేటాయించిన అరగంట వరకు కూడా శుభ్రం చేయలేదు.

ఈవో : ఇది పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

15. అప్పన్న – విశాఖ

ప్రశ్న : శ్రీవారి సేవకులతో తిరునామం పెట్టించండి. విశాఖలోని ఆలయంలో అర్జిత సేవలకు భక్తులను అనుమతించండి. ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం అందించండి.

ఈవో : ఒక నెలలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తాం. శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడతాం.

16. ఎర్ర మల్లయ్య – మదనపల్లి

ప్రశ్న : తిరుమలకు కాలినడకన వచ్చాము. క్యూలైన్లలో ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది. నడక మార్గంలో తాగునీటి వసతి కల్పించండి.

ఈవో : ఏప్రిల్ 1వ తేదీ నుంచి నడక మార్గంలో వచ్చే భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నాం. వీటిని పొందితే నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. నడక మార్గాల్లో అవసరమైనచోట్ల తాగునీటి వసతి కల్పిస్తాం.

17. సరితా రెడ్డి – కరీంనగర్

ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్ లైన్లో కొన్ని ఇవ్వండి.

ఈవో : ఈ టికెట్లు పరిమితం కాబట్టి ఆఫ్ లైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల కోరిక మేరకే ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం.

18. అనిల్ కుమార్ – తాడిపత్రి

ప్రశ్న : అన్నప్రసాదాలు వృథా కాకుండా చూడండి.

ఈవో : భక్తులు అవసరమైన మేరకే వడ్డించుకుని అన్నప్రసాదాలు వృథా కాకుండా చూడాలని కోరుతున్నాం.

19. సుబ్రహ్మణ్యం – విజయవాడ

ప్రశ్న : వృద్ధులకు దర్శనం కోటాతో పాటు గదుల కోటా కూడా కేటాయించండి.

ఈవో : తిరుమలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ వసతి పరిమితంగా ఉంది. తిరుపతిలో గదులు పొంది తిరుమల శ్రీవారి దర్శనానికి రావచ్చు.

20. శ్రీనివాస్ – విజయవాడ

ప్రశ్న : శ్రీవారి ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో భక్తులను ఇరుకుగా కూర్చోబెడుతున్నారు. ఇబ్బందిగా ఉంది.

ఈవో : భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ టికెట్లు కేటాయించడం వలన అలా జరుగుతోంది. ఇరుకుగా లేకుండా చర్యలు తీసుకుంటాం.

21. లీలాకృష్ణ – తిరుపతి.

ప్రశ్న : స్విమ్స్ లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వసతులు పెంచండి.

ఈవో : సిమ్స్ ఆసుపత్రిని ఆరు నెలల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.