శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి శేష వాహ‌నం


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి శేష వాహ‌నం

తిరుపతి, 09 , ఫిబ్రవరి2018 ; తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.