OVER 36 THOUSAND DEVOTEES TREK TUMBURU THEERTHAM _ తుంబురు తీర్థ ముక్కోటిలో 36 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు

TIRUMALA, 06 APRIL 2023: A total of 36,200 devotees trek Tumburu Theertham located in deep woods and a steep valley in Sesha Chala on Wednesday and Thursday.

TTD has made elaborate arrangements of Annaprasadam, water and security at Papavinasanam dam for the devotees trekking the tedious path.

People suffering from chronic, asthma, obesity and heart-related diseases were not allowed to trek.

Due to space constraints, APSRTC buses operated to transport devotees within Tirumala to Papavinasanam dam.

On April 5, a total of 23000 devotees and on Thursday 13,200 devotees trekked the path and offered Theertha Snanam on the auspicious day of Phalguna Pournami.

TTD senior officials from Annaprasadam, Health, Vigilance and Forest departments monitored round the clock and ensured safety of devotees on April 5 and 6 upon the instructions of TTD EO Sri AV Dharma Reddy.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తుంబురు తీర్థ ముక్కోటిలో 36 వేల మందికి పైగా పాల్గొన్న భక్తులు
 
తిరుమల 2023 ఏప్రిల్ 06: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటిలో 36,200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. 
 
ఏప్రిల్ 5న మొత్తం 23 వేలమంది, ఏప్రిల్ 6న 13,200 మంది భక్తులు ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన తీర్థ స్నానం ఆచరించారు.
 
టిటిడి విస్తృత ఏర్పాట్లు  
 
టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తుంబురు తీర్థానికి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంట‌ల నుండి నిరంత‌రాయంగా ఉద‌యం, సాయంత్రం పొంగలి, ఉప్మా,  పాలు, మజ్జిగ అందించారు. అదేవిధంగా  మధ్యాహ్నం, రాత్రి  సాంబరు అన్నం, పెరుగన్నం,  టమోటఅన్నం, పులిహోరాను భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. 
 
ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో తరచూ ప్రకటనలు చేశారు. 
 
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ  అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు  అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టిటిడి భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 
 
టిటిడి కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర  ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.