SRI GT PAVITROTSAVAMS FROM SEPT.1-3_ సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupathi, 22 August 2017: The three day annual pavitrotsavams in Sri Govinda Raja Swamy temple will be observed from September 1-3.

On the first day there will be Pavitra Pratista, second day Pavitra Samarpana and on final day Purnahuti will be performed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగస్టు 22, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

సెప్టెంబరు 1న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 2న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ ఉంటుంది. సెప్టెంబరు 3న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.

గహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.